Friday, March 29, 2024

ఢిల్లీ జేఎన్‌యూలో మళ్లి ఉద్రికత్త

ఢిల్లిలోని జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీలో మరోసారి ఉద్రికత్తలు చోటుచేసుకున్నాయి. యూనివర్శిటీ గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు, అభ్యంతరకర రాతలు రాశారు. వర్శిటీలోని స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ విభాగం గోడలు, పలువురు ఫ్యాకల్టి గదుల డోర్లపై రాతలు రాశారు.

దీంతో, వర్శిటీ క్యాంపస్‌లో అలజడి చెలరేగింది. దీనిపై యూనివర్శిటీ వైస్‌ ఛాన్సెలర్‌ శాంతిశ్రీ పండిట్‌ దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇది లెప్టిnస్ట్‌ భావజాలం ఉన్న విద్యార్థుల పనేనని ఏబీవీపీ ఆరోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement