Friday, March 29, 2024

క్రికెట్ పై ఉన్న అభిమానం…. ఏకంగా కొండనే ఎక్కించింది !!

క్రికెట్ కు ఎంత మంది అభిమానులు ఉంటారో చెప్పనవసరం లేదు. క్రికెట్ అంటే బట్టలు చింపుకొనేవారు కూడా ఉన్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని అయిన సుధీర్ కుమార్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే మూడో వన్డే మ్యాచ్ చూసేందుకు సాహసం చేస్తున్నాడు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పూణేలో జరుగుతున్న ఈ సిరీస్ కు ప్రేక్షకులను అనుమతించలేదు.

ఈ నేపథ్యంలోనే సుధీర్ రెండు కిలోమీటర్లు అడవి ప్రాంతంలో ప్రయాణించి ఘోర దీశ్వర్ కొండ ఎక్కుతున్నాడు. తొలి రెండు మ్యాచ్ లను కూడా సుధీర్ అక్కడి నుండి చూశాడు. ప్లేయర్లు కనిపించకపోయినా బిగ్ స్క్రీన్ పై ఆటగాళ్లను చూసి ఆనందంతో చక్కర్లు కొడుతున్నాడు ఈ అభిమాని. ఇక టీమ్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డే ల సిరీస్ లో మొదటి మ్యాచ్ ఇండియా గెలవగా….రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలుచుకుంది. ఇక మూడో మ్యాచ్ ఆదివారం జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement