Thursday, April 25, 2024

18.35 లక్షల మంది రైతులకు ‘ఉచిత విద్యుత్’..ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం..

విద్యుత్ చార్జీలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు అని పెరుగుతాయి.. తగ్గుతాయని విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. విద్యుత్ రేట్లలో ప్రతి గంటకు మార్పులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్రంలో రైతుల‌కు శుభ‌వార్త అందించింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. రాష్ట్రంలోని 18.35 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని శ్రీకాంత్ ప్రకటన చేశారు. యూనిట్ విద్యుత్ ను రూ.4.46 లకు కొని రైతులకు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే సోలార్ విద్యుత్ ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దాని కోసం పది వేల మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిని టెండర్ల ద్వారా రూ.2.49 లకు కొంటున్నట్టు శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement