Tuesday, March 26, 2024

కుమారుడికి గుడికట్టి.. తల్లిదండ్రుల పూజలు.. ఎక్కడంటే..

చనిపోయిన కుమారుడికి గుడికట్టి నిత్యపూజలు చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు. తమను ఒంటరిని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన కుమారుడి కోసం తల్లిదండ్రులు గుడికట్టించారు. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘటన జరిగింది. కాంచీపురానికి చెందిన కరుణాకరన్​ (80), భార్య శివగామి (75) ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేశారు. వారి కుమారుడు హరికరన్ ​(48) గతేడాది మే 10న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత తన కుమారుడి జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న ఈ వృద్ధ దంపతులు. ఓ శిల్పిని సంప్రదించారు. రూ.2.5 లక్షలు వెచ్చించి 5.3 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహానికి తల్లిదండ్రులు పూజలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement