Friday, April 26, 2024

ఢిల్లీలో సీజన్ లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ వేసవి సీజన్ లోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. ఏకంగా 44 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతారణశాఖ డేటా ప్రకారం ఈ సీజన్ లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. నజఫర్ ఘర్, నరేలాలో 44.4 డిగ్రీలు, మంగేశ్ పూర్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అయితే ఢిల్లీ వాసులకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు అందించింది. శనివారంనాడు ఆకాశం కొంతమేర మేఘావృతం అయ్యుంటుందని, స్వల్ప వర్షం కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారంనాటికి ఉష్ణోగ్రతలు తగ్గి … 38 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement