Tuesday, April 23, 2024

రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాటాలకు ప్రణాళిక ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా ఈ సమావేశానికి సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, బాలమల్లేశ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement