Tuesday, April 23, 2024

చిరంజీవి, ఎన్టీఆర్‌ను కలిసిన తెలంగాణ మంత్రి, ఆయన తనయుడు

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌లను కలిశారు. తన కుమారుడు నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా తనయుడితో కలిసి ఆయన చిరంజీవి, ఎన్టీఆర్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. నయన్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‏లకు పెద్ద అభిమాని. అందుకే కొడుకు బర్త్ డే సందర్భంగా అతడిని వారి వద్దకు మంత్రి పువ్వాడ అజయ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా నయన్ రాజ్‌కు చిరంజీవి, ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. కాగా పువ్వాడ అజయ్ తన కుమారుడితో కలిసి మంత్రి కేటీఆర్‌ను కూడా కలిసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement