Thursday, April 25, 2024

మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు బీభత్సంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 3వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వైరస్‌ బారిన పడి కోలుకుంటున్నారు. తాజాగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని మంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement