Friday, April 19, 2024

ఆశా వర్కర్లకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

ఆశా వర్కర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కంటే ఎక్కువగా వేతనాలు అందిస్తున్నామన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్లా జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌.. తంగళ్లపల్లి మండలం జిల్లెల‌లో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన, హెల్త్‌ ప్రొఫైల్‌, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసీఆర్‌ కిట్‌ వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement