Friday, April 26, 2024

ఆర్ధిక పురోగతిలో తెలంగాణ ముందంజ.. తగ్గుతున్న అప్పుల శాతం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆర్ధిక క్రమశిక్షణతో మెలుగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి 2022-23 ఆర్ధిక ఏడాది కొంత ప్రతికూలతలను చూపింది. ప్రభుత్వం ఆశించిన రాబడుల అంచనాల్లో కోతలు పడనున్నాయని స్పష్టమవుతోంది. మార్చి నెలాఖరుతో ముగుస్‌తున్న ఆర్ధిక యేడాదిలో లక్ష్యసాధన కష్టమనే అభిసప్రాయం వినిపిస్తోంది. జనవరి చివరినాటికి 62శాతం లక్ష్యం చేరగా రూ.1.89లక్షల కోట్ల వ్యయాల్లో రూ.1.24లక్షల కోట్లను ఖర్చు చేసింది. పన్నేతర ఆదాయాలు భారీగా దెబ్బతీశాయి. రూ.25వేల కోట్ల అంచనాల్లో రూ.10వేల కోట్లకు పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ముగుస్తున్న ఆర్ధిక యేడాదిలో రూ.1.26లక్షల కోట్ల పన్ను ఆదాయాలను అంచనా వేసుకోగా ఇప్పటివరకు రూ.1.10లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. కేంద్ర గ్రాంట్లు, రుణాల్లో తీవ్ర ఎదురుదెబ్బలు ఆర్ధశిక రంగాన్ని కుంగదీశాయి. కేంద్రంనుంచి రూ.41వేల కోట్లకుగానూ రూ.7876కోట్లే ఖజానాకు చేరింది.

అదనపు ఆదాయాలు, అద్భుత పురోగతి మంచి బలాన్నిస్తుందని భావించినా కేంద్ర నియంత్రణలు వ్యతిరేక ప్రభావం చూపాయి. అయినప్పటికీ సంపద పెంచి ప్రజలకు పంచేలా తెలంగాణ సర్కార్‌ చేస్తున్న ధీర్ఘకాలిక వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పెట్టుబడులకు అప్పులు చేస్తూ, వాటిని ఉత్పాదక రంగాలకు వెచ్చించడం, సంపద సృష్టించడంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ దృష్టిని ఆకర్శిస్తోంది. జీఎస్‌డీలో అప్పుల శాతం 25కు పెంచుతూ అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చిన కేంద్రం తిరిగి నియంత్రణలతో కట్టడి చేసింది. అయినప్పటికీ కేంద్రం అనుమతించిన నిబంధనలకు లోబడే రుణాలు సేకరించడమే కాకుండా అతి తక్కువ వడ్డీలకు అప్పుల సేకరణ తెలంగాణకే చెల్లుతోంది. 2019-20 వార్షిక ఏడాదిలో 21శాతానికి రుణాలను పరిమితం చేయగా, ఈ ఏడాదిలో ఇవి 17శాతంలోనే ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ ఇప్పటికే ప్రశంసించింది.

- Advertisement -

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులను తిరిగి చెల్లించేందుకు 25ఏళ్లకుపైగా సమయం ఉండగా, కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలతో ఇబ్బందుల పాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. జీఎస్‌డీపిలో ద్రవ్యలోటు 3నుంచి 4.5 శాతంగా ఉండొచ్చని నిబంధనలుండగా, దీనిని 2.53 శాతానికే తెలంగాణ పరిమితం చేసుకుంది. 2016-17లో రాష్ట్రం తీసుకున్న అప్పు రూ.131531కోట్లుకాగా, జీఎస్‌డీపీ 659033 ఉండగా జీఎస్‌డీపీలో అప్పుల శాతం 20.04గా నమోదైంది. 2017-18లో అప్పు రూ.1,52,180కోట్లుకగా, జీఎస్‌డీపీ 753811గా ఉంటూ జీఎస్‌డీపీలో అప్పుల శాతం 20.23గా ఉంది. 2018-19లో 1,79,795 తీసుకోగా, జీఎస్‌డీపీ 865688గా ఉంటూ ఇందులో అప్పుల శాతం 20.77గా ఉంది. ఇక 2019-20లో రూ.2,03,730కోట్ల అప్పుతో జీఎస్‌డీపీ 9,50,000ల అంచనాతో జీఎస్‌డీపీలో 17శాతంగా అప్పులు నమోదయ్యాయి. 2022-23లో అంటే ఈ ఏడాది అప్పుల శాతం తగ్గింది. మరోవైపు ప్రభుత్వ పెట్టుబడులు, ముందుచూపుతో ప్రజల సంపద మరింతగా అభివృద్ధి చెందుతోంది.

ఏ రాష్ట్రమైనా తన పన్నుల రాబడికంటే 10శాతానికి మించి రుణాలపై వడ్డీలకు చెల్లింపులు చేయరాదని, జీఎస్‌డీపీలో 3.5 శాతానికి మించి అప్పులు చేయరాదని షరతు ఉంది. రెవెన్యూ మిగులు అధికంగా ఉన్న తెలంగాణ, గుజరాత్‌ రాస్ట్రాలకు మాత్రం 3.5 శాతం రుణ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. మిగులు రాష్ట్రాలుగా ఘనతను సాధించడంతో ఈ మేరకు కేంద్రం ఈ వెసులుబాటును వర్తింపజేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులపై వడ్డీలకు చెల్లింపులు రాబడుల్లో 10శాతంలోపే ఉండాలన్న షరతును పక్కాగా అమలు చేయడంతో భవిష్యత్‌ అప్పులపై ఢోకా లేకుండా పోయింది. అప్పుల తిరిగి చెల్లింపులకు 25 ఏళ్లపాటు సమయం చిక్కి, వడ్డీల భారం కూడా తగ్గింది. 2015-16లో రూ.7942 కోట్లుగా ఉన్న వడ్డీల భారం తాజాగా 10శాతం లోపుగానే నమోదవుతున్నది. రాష్ట్ర ఆదాయ స్థితిగతులకు కీలకమైన పన్నుల రాబడి, పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లను భారీగా నిర్ధేశించుకుని అంచనాలు వేసుకోగా జీఎస్టీ మినహా మిగతా రాబడులు అనుకూలంగానే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement