Tuesday, March 26, 2024

చెన్నైలో ఓటేసిన తెలంగాణ గవర్నర్

దేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.  ఉదయాన్నే ప్రముఖులంతా వచ్చి ఓటు వేస్తున్నారు. తమిళనాట సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఒటేశారు. తద్వారా సామాన్యులకూ ప్రేరణ కలిగిస్తున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి గవర్నర్ అయిన తమిళిసై సౌందరరాజన్ ఓటు వేయడానికి తమిళనాడు వచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కమ్ పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన భర్తతో కలిసి ఓటు వేశారు. ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని గ‌వ‌ర్న‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు.

త‌మిళ‌నాడులో 234 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒకే ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 3,998 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.  కోలీవుడ్ స్టార్ హీరోలు  సైతం ఉదయాన్ని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రజనీకాంత్, అజిత్, కార్తీ, సూర్య లాంటి స్టార్ హీరోలు వచ్చి ఓటువేసి సందడిని పెంచుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement