Saturday, April 20, 2024

Telangana | ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి.. ఉత్త‌ర్వులు జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

తెలంగాణ‌లో పనిచేస్తున్న 2009వ‌ బ్యాచ్ చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా ప‌దోన్న‌తి ల‌భించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల (బుధవారం) దీనికి సంబంధించిన‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ అధికారులైన‌ అంబర్ కిషోర్ జా, రెమా రాజేశ్వరి, ఎల్ ఎస్ చౌహన్, నారాయణ నాయక్, పరిమళ హన, రంగారెడ్డి ఇక మీద‌ట డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్‌ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతిపై ప‌నిచేయ‌నున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) గా ఉన్న‌ రేమ రాజేశ్వరిని తిరిగి అక్కడే నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement