Thursday, March 28, 2024

Telangana | ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు.. షెడ్యూలు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవ్వాల (బుధవారం) వెల్లడించారు. మరోవైపు తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2022-23 నుంచి ఈ సంస్కరణలు అమలు అవుతాయని పేర్కొంది. సైన్స్‌ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు ఉంటుందని ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement