Friday, April 19, 2024

గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు

హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించడం తెలిసిందే. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారైన విగ్రహాలను నిమజ్జనం చేయరాదని, పీఓపీ విగ్రహాలను కేవలం హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కృత్రిమ రంగులు, రసాయనాలు లేని గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అంగీకరించిన హైకోర్టు ఆ విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపున మాత్రం నిమజ్జనం చేయవద్దని ఆదేశించింది. సంజీవయ్య పార్కు, పీవీ మార్గ్ దిశగా నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది.

అయితే హైకోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. దాంతో రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసింది. ఈ పిటిషన్ బుధవారం నాడు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement