Thursday, April 25, 2024

తెలంగాణలో యూనివర్సిటీలకు కొత్త వీసీలు

తెలంగాణ‌లోని యూనిర్సిటీల్లో రెండున్న‌రేళ్లుగా ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సిలర్ పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం కొత్త వీసీల‌ను నియమించింది. సీఎం కేసీఆర్ ఖరారు చేసిన వీసీల జాబితాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. తాజాగా ఆ జాబితాను ప్రభుత్వం విడుద‌ల చేసింది.

✪ ఉస్మానియా వ‌ర్సిటీ: ప్రొ. రవీందర్ యాదవ్
✪ కాకతీయ వర్సిటీ: ప్రొ. రమేష్‌
✪ జేఎన్‌టీయూ: కట్టా నర్సింహారెడ్డి
✪ జేఎన్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్: ప్రొ. కవిత దర్యాని
✪ అంబేద్కర్ వర్సిటీ: సీతారామరావు
✪ తెలుగు వర్సిటీ: కిషన్‌రావు
✪ తెలంగాణ వర్సిటీ: రవీందర్ గుప్తా
✪ శాతవాహన వర్సిటీ: ప్రొ. మల్లేశం
✪ మహాత్మాగాంధీ వర్సిటీ: ప్రొ. గోపాల్‌రెడ్డి
✪ పాలమూరు వర్సిటీ: ప్రొ.రాథోడ్

Advertisement

తాజా వార్తలు

Advertisement