Thursday, April 25, 2024

రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్.. ఈ రూల్స్ తప్పక పాటించాలి

బుధవారం నుండి తెలంగాణ ఎంసెట్ ప్రారంభం కానున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. గత ఏడాది కంటే 28 వేల మంది ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఏపీ నుండి 50 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకు అన్ని సెట్స్ అయ్యిపోయాక పరీక్ష నిర్వస్తామని.. ఇప్పటి వరకు ఒకటి రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని తెలిపారు.

ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ అని పేర్కొన్న ఆయన.. విద్యార్ధులు మాస్కు లు ధరించి రావాలన్నారు. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని.. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉందని.. మొత్తం 6 సెషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ … 3 సెషన్స్ ఉంటాయని.. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. మొత్తం 105 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఇందులో తెలంగాణలో 82, ఏపీలో 23 ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు పెరిగిన నేపథ్యంలో సెంటర్లు, సెషన్స్ పెంచామన్నారు. ఈ పరీక్షల ఫలితాలు 15 రోజుల్లో వెల్లడిస్తామని ఎంసెట్ కన్వీనర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement