Saturday, April 20, 2024

తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ ఎంసెట్ -2021 ద‌ర‌ఖాస్తు గ‌డువు రేప‌టితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ వెల్లడించారు. ఈ నెల 26 వ‌ర‌కు ఎలాంటి అప‌రాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని సూచించారు. కాగా ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌లో జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement