Thursday, April 25, 2024

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… ఈరోజు కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 609 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనవి 81 కేసులు. ఇదే సమయంలో 647 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,46,606కి పెరిగింది. వీరిలో 6,34,018 మంది కోలుకోగా… 3,811 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు 1,08,921 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 98.05 శాతంగా ఉంటే.. భారత్‌లో 97.36 శాతంగా ఉందని కోవిడ్‌ బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ సర్కార్.. ఇక, తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 81 కేసులు నమోదు కాగా.. కరీంనగర్‌లో 67, ఖమ్మంలో 51, నల్గొండలో 48, వరంగల్‌ అర్బన్‌లో 41, పెద్దపల్లిలో 39, రంగారెడ్డిలో 36, మేడ్చల్‌లో 36 కేసులు.. ఇలా అత్యధికంగా కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే, హైదరాబాద్‌లో కంటే.. కరీంనగర్‌లోనే నిన్న అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ప్రజలతో ప్రమాణం చేయించిన TRS ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement