Friday, March 29, 2024

రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

ఈనెల 24న అంటే శుక్రవారం నాడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. తొలుత శుక్రవారం ఉద‌యం ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన‌నున్నారు. అనంత‌రం జ‌రిగే బీఏసీ స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని అసెంబ్లీ స‌మావేశాల అజెండాను ఖ‌రారు చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి సీఎం కేసీఆర్ ప‌య‌నం కానున్నారు.

ఈ నెల 25న కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం కానున్నారు. 26వ తేదీన విజ్జానభవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో సీఎం స‌మావేశ‌మై చ‌ర్చిస్తారు. 26న సాయంత్రం కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement