Friday, April 19, 2024

తెలంగాణలో ఉద్యోగులకు రేపు గుడ్ న్యూస్ ?

తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం మంగళవారం నాడు శుభవార్త చెప్పనుంది. ఎందుకంటే రేపటి కేబినెట్ భేటీ ముందుకు పీఆర్సీ అంశం రానుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించినా.. సంబంధిత ఫైల్ కదలికలో ఇప్పటివరకు పురోగతి లేదు. ఈ క్రమంలో మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో పీఆర్సీ అంశంపై చర్చించే అవకాశం ఉంది. రేపు ఉద్యోగుల వేతన సవరణ నివేదికను కేబినెట్ ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ రేపు ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నేపథ్యంలో పీఆర్పీకి సంబంధించి రేపు అధికారిక ప్రకటన, ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఈ మేరకు ఉద్యోగుల ఫిట్‌మెంట్, ఇతర అంశాలపై ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement