Saturday, April 20, 2024

పట్టణీకరణలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ.. హరిత పట్టణాలు తెలంగాణ నగరాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పట్టణీకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. పెరుగుతున్న పట్ట ణ జనాభాకనుగుణంగా సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వినూత్న ఒరవడితో చేపడుతున్న ఈ కార్యక్రమానికి మంత్రి కేటీ రామారావు నేతృత్వం వహిస్తున్నారు. దేశంలో ప్రామాణిక నగరాలు, పట్టణాలు ఉన్న రాష్ట్రంగా ప్రతి ఏటా తెలంగాణకు జాతీయ అవార్డులు అందుతున్నాయి. జీహెచ్‌ఎంసీపతోపాటు రాష్ట్రంలోని 142 నగరాల్లో పురపాలక సంస్థలకు రూ.4304 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల్లో నుంచి ఇప్పటి వరకు రూ.3936 కోట్ల అంటే 92శాతం నిధులను పురపాలక సంస్థల అభివృద్దికి వినియోగించారు.

అందులో జీహెచ్‌ఎంసీకి రూ.2276 కోట్లు, మిగిలిన 141 పురపాలికలకు రూ.2028 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు పురపాలక సంస్థలకు ఆర్థికంగా చేయూతంగా నిలిచేందుకు పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం నెల నెలా నిధులు ఇస్తోంది. అందులో భాగంగా 2022-23లో ఫిబ్రవరి వరకు నెలకు రూ.116 కోట్ల చొప్పున విడుదల చేసింది. ఈ నిధుల్లో జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.61కోట్లు, ఇతర 141 పురపాలక సంస్థలకు రూ.55 కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. పర్యావరణ పరిరక్షణ , శానిటేషన్‌ పైన పురపాలక సంస్థలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

జీహెచ్‌ఎంసీ మినహా 141 పురపాలక సంస్థలకు రూ.55కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. పర్యావరణ పరిరక్షణ, శానిటేషన్‌ పైన పురపాలక సంస్థలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ మినహా 141 పురపాలక సంస్థల్లో ప్రతిరోజు 4356 టన్నుల చెత్తను సేకరిస్తున్నాయి. ఇంటింటికీ తిరిగి 100శాతం చెత్తను సేకరించి, తరలించేందుకు కొత్తగా 2165 పారిశుధ్య వాహనాలను కొనుగోలు చేవారు. గతంలో ఉన్న2 548 పారిశుధ్య వాహనాల ద్వారా రోజుకు 2675 టన్నుల చెత్తను మాత్రమే సేకరించి తరలించేవారు. ప్రస్తుతం పారిశుధ్య చెత్త సేకరణ వాహనాల సంఖ్య 4713కు పెరగడంతో పారిశుధ్య సమస్య లేని పట్టణాలు ఆవిష్కృతమవుతున్నాయి. సేకరించిన చెత్తను ప్రాసెస్‌ చేసేందుకు 141 పురపాలక సంస్థల్లో మొత్తం 1233 ఎకరాల విస్తీర్ణంలో డంప్‌ యార్డులను ఏర్పాటు చేశారు. చెత్తను తడి, పొడిగా విడదీయుటకు 206 డ్రై సోర్స్‌ కలెక్షన్‌ సెంటర్స్‌ ను ఏర్పాటు చేశారు.

చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చేందుకు 229 కంపోస్టు బెడ్స్‌ ను నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్‌ఎంసీ మినహా ఇతర చోట్ల రూ.428కోట్లతో రోజుకు 2035 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన 139 మల వ్యర్తాల శుద్ధిప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 20 చోట్ల పూర్తయిన 14చోట్ల పనులు తుది దశలో ఉన్నాయి. 49 చోట్ల చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 50 చోట్ల పనులు ప్రారంభం కానున్నాయి. పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను పురపాలక సంస్థల్లో ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది. 141 పురపాలక సంస్థల్లో ఉన్న 3468 వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాల కింద ట్రీ పర్కారులను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా 2021 నుంచి ఇప్పటి వరకు 34. 59లక్షల మొక్కలను నాటారు.

తెలంగాణ హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టారు. 2023-24లో 141 పురపాలక సంస్థల్లో 2.14కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా 1012 నర్సరీల్లో 2.36కోట్ల మొక్కలను పెంచుతున్నారు. మల్టిd లేయర్‌అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 141 పురపాలికల్లో 796 జోన్లలో 1208 కిలోమీటర్ల మేర పలు రకాల మొక్కల నాటారు. పచ్చదనం పెంపుదల కోసం చేపట్టాల్సిన పనులకై 141 పురపాలికల్లో ఇప్పటి వరకు రూ.779 కోట్ల నిధులను గ్రీన్‌ బడ్జెట్‌ కింద కేటాయించారు.

హరిత నిధి కింద ట్రేడ్‌ లైసెన్స్‌ దారుల నుంచి రూ.128.97 లక్షలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి రూ.14.28లక్షలు కలిపి మొత్తం రూ.1కోటి 43లక్షల 25వేలు జమ అయ్యాయి. 141 పురపాలక సంస్థల్లో ప్రభుత్వం 453 వైకుంఠదామాలను మంజూరు చేసింది. వాటిలో 297 వైకుంఠ దామాల పనులు పూర్తయ్యాయి. మరో 149 చోట్ల చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణహిత, అభివృద్ధి పనులతో తెలంగాణలోని పురపాలక సంస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement