Wednesday, April 24, 2024

Telangana: 75 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి

తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్.. ఏఎస్ఐలకు శుభవార్త వినిపించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ పోలీసుల ప్రశంసనీయమైన కృషి, అవిశ్రాంత సేవలు, అంకితభావాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసుల కృషి, సేవలకు గుర్తింపుగా 75 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పించినట్లు డీజీపీ అంజనీ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement