Thursday, March 28, 2024

మైనర్ బాలిక దారుణహత్య.. రోజంతా బ్రిడ్జికి వేలాడిన బాలిక మృతదేహం

యూపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డియోరియా జిల్లాలోని ఓ రైల్వే బ్రిడ్జి కింద వేలాడుతూ 17 ఏళ్ల బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం ఆ మృతదేహం రైల్వే వంతెన కింద వేలాడుతూనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ బాలిక కుటుంబ సభ్యుల వివరాలు సంపాదించి విచారించారు. అయితే విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ బాలికను స్వయంగా తాత, మామయ్యలే హత్య చేసినట్టు తేలింది. బాలిక లైఫ్ స్టైల్ నచ్చని కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది

హత్యకు గురైన బాలిక ఇటీవల తన తల్లితో కలిసి యూపీలోని డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. అయితే వచ్చిన నాటి నుంచి ఆ బాలిక పద్ధతి ఇంట్లో వాళ్లకి నచ్చలేదు. ఆమె ధరిస్తున్న దుస్తులు, ప్రవర్తన ఆ బాలిక తాతకు, మామయ్యలకు ఆగ్రహం తెప్పించాయి. అలాంటి బట్టలు వేసుకోవద్దని వారు ఆ బాలికను హెచ్చరించారు. అయితే ఆ బాలిక వారి మాటలను పట్టించుకోలేదు. రెండ్రోజుల క్రితం ఈ విషయమై బాలిక, ఆమె తాత మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాలిక తనకు ఎదురుతిరగడంతో ఆగ్రహానికి గురైన ఆమె తాత క్షణికావేశంలో ఆమె తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో భయపడిన తాత, మామయ్యలు ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. మార్గంమధ్యలోనే ఆ బాలిక మృతిచెందింది.

అనంతరం బాలిక మృతదేహాన్ని డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చి అక్కడి నుంచి కిందకు తోసేశారు. అయితే కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకుపోవడంతో మృతదేహం తలకిందులుగా వేలాడింది. దానిని గమనించని కుటుంబసభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆ మృతదేహం అక్కడే వేలాడింది. కొందరు స్థానికులు ఆ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆ బాలిక తాతను అరెస్ట్ చేశారు. కాగా మామయ్యలు పరారీలో ఉన్నారు.

ఈ వార్త కూడా చదవండి: పార్లమెంట్‌లో ఎంపీలను పరుగులు పెట్టించిన ఎలుక

Advertisement

తాజా వార్తలు

Advertisement