Saturday, April 20, 2024

తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం

టీ20 సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్లో అద్దిరపోయే విక్టరీ కొట్టింది. ఆతిథ్య జట్టును 38 పరుగుల తేడాతో మట్టికరిపించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (34 బంతు ల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (46) రాణించారు. ఓ మాదిరి లక్ష్యఛేదనలో లంక చెమటోడ్చింది. చరిత అసలంక (44) మినహా తక్కినవాళ్లు విఫలమవడంతో లంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 4, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

భారత్ నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ భువనేశ్వర్ దారుణంగా దెబ్బకొట్టాడు. కీలకమైన నాలుగు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. ఫలితంగా ఆ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగా 126 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ తీసుకుని విజయంలో తమవంతు పాత్ర పోషించారు.శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక చేసిన 44 పరుగులే అత్యధికం. అవిష్క ఫెర్నాండో 26, దాసున్ శనక 16, మినోద్ భానుక 10 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేదు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధవన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధ సెంచరీతో అలరించగా, ధవన్ 46, సంజు శాంసన్ 27, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు. వన్డే సిరీస్‌లో విఫలమైన హార్దిక్ పాండ్యా (10) మరోమారు తడబడ్డాడు. శ్రీలంక బౌలర్లలో చమీర, హసరంగ చెరో రెండు వికెట్లు తీసుకోగా, కరుణరత్నె ఒక వికెట్ పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రేపు జరుగుతుంది.

ఇది కూడా చదవండి: సెప్టెంబ‌ర్ 19 నుంచి ఐపీఎల్‌-14వ సీజ‌న్ పునఃప్రారంభం..

Advertisement

తాజా వార్తలు

Advertisement