Thursday, April 25, 2024

టీమిండియా టెస్ట్​ కెప్టెన్​ బుమ్రా మరో రికార్డు.. ఆరు వికెట్లతో విజృంభణ

టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా టెస్టు క్రికెట్‌లో మొన్న ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి వరల్డ్‌ రికార్డు సృష్టించగా, తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. ఐదో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 68 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పటి వరకు ఈ సిరీస్‌ బుమ్రా తన ఖాతాలో 21 వికెట్లు సాధించాడు.

ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్‌ బౌలర్‌గా ఇప్పటి వరకు భువనేశ్వర్‌కుమార్‌ పేరిట ఉన్న రికార్డును బుమ్రా అధిగమించాడు. భువి 2014లో ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు పడగొట్టాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement