Friday, April 19, 2024

శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా టార్గెట్ 276 పరుగులు

కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. దీంతో ధావన్ సేన ముందు పరుగుల విజయలక్ష్యం నిలిచింది. శ్రీలంక బ్యాటింగ్ విషయానికి వస్తే… అవిష్క ఫెర్నాండో 50, అసలంక 65, చమిక కరుణరత్నే 44 నాటౌట్, మినోద్ భనూకా 36, ధనుంజయ డిసిల్వ 32 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు దక్కించుకున్నారు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. కాగా తొలి వన్డేలో శ్రీలంక విధించిన 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: లంకతో రెండో వన్డే గెలిస్తే టీమిండియా కొత్త రికార్డు

Advertisement

తాజా వార్తలు

Advertisement