Saturday, April 20, 2024

ఊపిరి పీల్చుకున్న టీమిండియా.. పంత్‌ సన్నిహితులకు నెగిటివ్

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు ఊరట కలిగించే వార్త. గురువారం నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ కరోనా పాజిటివ్ బారిన పడటంతో అతడితో కాంటాక్ట్ అయిన క్రికెటర్లకు కరోనా భయం పట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ కరోనా పరీక్షలు నిర్వహించింది. అయితే వారందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

రిషబ్ పంత్‌తో పాటు అతడికి త్రోలు విసిరే దయానంద్ అనే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వీళ్లిద్దరూ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో సన్నిహితంగా ఉన్న వృద్ధిమాన్ సాహా, యువ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్, కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు. మిగిలిన క్రికెటర్లు డుర్హమ్‌లోని శిక్షణ శిబిరానికి తరలివెళ్లారు. గురువారం కోహ్లీ సేనకు ఆర్టీపీసీఆర్ కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం పంత్ బాగున్నాడని, మరో 7 రోజులు అతడు ఐసోలేషన్‌లోనే ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.

ఈ వార్త కూడా చదవండి: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement