Thursday, April 18, 2024

వన్డేల్లో టీమ్ ఇండియా వరల్డ్‌ రికార్డు

తిరువనంతపురం: శ్రీలంకపై 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా వన్డే క్రికెట్‌ చరిత్రలో ప్ర‌పంచ‌ రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరు మీద ఉంది. కివీస్ జట్టు ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది.. ఇక 275 ప‌రుగుల విజ‌యంతో ఆస్ట్రేలియా, 272 ప‌రుగుల‌తో సౌతాఫ్రికాలు ఉన్నాయి. కాగా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ద‌క్కింది.. అలాగే మూడే వ‌న్డేల సిరీస్ లో రెండు శ‌త‌కాలు సాధించిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను కూడా అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement