Thursday, March 28, 2024

లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌కు ఆరేళ్ల జైలు శిక్ష..

చిరంగ్‌: పాఠాలు చెప్పాల్సిన టీచర్‌ ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినందుకు శిక్ష పడింది. అస్సాంలోని చిరంగ్‌ జిల్లాలో జరిగిన ఈ ఉదంతంలో కోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత నిందితుడికి ఆరేళ్ల శిక్ష విధించడమే కాకుండా 10 వేల జరిమానా విధించింది. గత సంవత్సరం ఈ టీచర్‌ మైనర్‌ విద్యార్థినిని రేప్‌ చేసినట్టు కోర్టు ఆధారాలు సేకరించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఐపిసి, పోక్సోచట్టం ప్రకారం బింజి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అడ్వకేట్‌ ప్రబిన్‌ దేబ్‌ రాయ్‌ తెలిపిన వివరాల ప్రకారం అడిషనల్‌ జిల్లా , సెషణ్స్‌ జడ్జి(పోక్సో) కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడైన సంజిడ్‌ కుమార్‌ రేకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది కోర్టు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement