Thursday, April 25, 2024

విద్యార్థితో మ‌సాజ్ చేయించుకున్న టీచ‌ర్-స‌స్పెండ్ చేసిన ఉన్న‌తాధికారులు

హ‌ర్దోయ్ లోని పోఖ‌రి ప్రైమ‌రీ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. క్లాస్‌రూమ్‌లో దర్జాగా కూర్చొని ఓ విద్యార్థితో మసాజ్ చేయించుకుంది ఓ టీచ‌ర్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గురువు స్థానంలో ఉండి ఆమె ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
యూపీలోని హ‌ర్దోయ్‌లోని పోఖ‌రి ప్రైమ‌రీ స్కూల్లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఉర్మిళా సింగ్‌ అనే ఉపాధ్యాయురాలు దర్జాగా కూర్చొని విద్యార్థితో మ‌సాజ్ చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోలో కుర్చీలో కూర్చున్న టీచ‌ర్ ఎడ‌మ చేతికి ఓ విద్యార్థి మ‌సాజ్ చేస్తున్నాడు. పిల్ల‌వాడు చేతికి మ‌సాజ్ చేస్తుండ‌గా ఆ టీచ‌ర్ బాటిల్‌తో నీళ్లు తాగుతోంది. క్లాస్‌రూమ్‌లోని మిగతా పిల్ల‌లు ఎవ‌రి ప‌నిలో వాళ్లున్నారు. ఆ స్కూల్లో ఆమె అసిస్టెంట్ టీచ‌ర్‌గా పనిచేస్తోంది. ఈ వీడియో బయటకురావడంతో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఆ మహిళా టీచర్‌‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

https://twitter.com/GradingNews/status/1552286155755835394
Advertisement

తాజా వార్తలు

Advertisement