Saturday, April 20, 2024

జగన్ సర్కారుది సిగ్గులేని ప్రభుత్వం: వంగలపూడి అనిత

గుంటూరు జిల్లా నరసరావుపేటలో లోకేష్ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలను అరెస్టు చేయడం, వందల మంది పోలీసులు మోహరించడంపై మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మండిపడ్డారు. ఉన్మాది చేతిలో హత్యకు గురైన అనూషకే న్యాయం చేయాలని కోరేందుకు నరసరావుపేట వస్తుంటే వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా నరసరావుపేట వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే గోడలను బద్దలు కొట్టుకునైనా వెళ్తామని పేర్కొన్నారు.

మరోవైపు ‘మా నాయకుడిని ఆపడానికి పెట్టిన పోలీసులలో 1% పోలీసులను శాంతిభద్రతల కోసం వినియోగించి ఉంటే గత రాత్రి మరో అభాగ్యురాలికి అన్యాయం జరిగి ఉండేది కాదు. ఇదొక సిగ్గులేని ప్రభుత్వం’ అని వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. కాగా నిన్న రాత్రి గుంటూరులో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement