Friday, March 29, 2024

క‌రోనా బారిన ప‌డిన ప‌రిటాల శ్రీరామ్ – హోం ఐసోలేష‌న్ లో చికిత్స‌

టిడిపి సీనియ‌ర్ నేత ప‌రిటాల శ్రీరామ్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్ధార‌ణ అయింది. దాంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌లువురు సెల‌బ్రిటీస్ ప‌డుతున్నారు. తాను హోం ఐసోలేష‌న్ లో చికిత్స పొందుతున్న‌ట్లు ప‌రిటాల శ్రీరామ్ ట్విట్ట‌ర్ లో తెలిపారు. కరోనా పరీక్షల్లో స్వల్ప లక్షణాలతో నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన మా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా లక్షణాలు కనబడితే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. మాస్కులు, భౌతిక దూరం పాటించాలి” అంటూ పరిటాల రవి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement