Wednesday, April 24, 2024

సీబీఐ విచారణకు హాజరైన మాజీ మంత్రి దేవినేని ఉమా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. దేవినేని ఉమ విచారణకు హాజరుకావడంతో సీఐడీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, వారిచ్చిన ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యానని తెలిపారు.

సీఎం జగన్ మాటలను మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు, ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… సీఐడీ విచారణకు హాజరు కావాలని ఉమను ఆదేశించింది. ఇదే సమయంలో ఆయనను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement