తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లనున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. కాసేపటికి క్రితమే రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు చంద్రబాబు. తొలుత రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్న ఆయన, సాయంత్రం అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తి పట్టణానికి రానున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రేణిగుంటకు చేరుకున్న చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీడీపీ పార్టీ తరఫు అభ్యర్థిని పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు.
తిరుపతిలో నేడు చంద్రబాబు ప్రచారం
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement