Thursday, March 28, 2024

మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చిన టీడీపీ ఎంపీ

శ్రీకాకుళం జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా మౌలిక సదుపాయాల కల్పనకు తన మూడు నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. ‘కోవిడ్‌ రోగులకు చికిత్స అందజేయడానికి ప్రస్తుత వసతులు సరిపోవట్లేదని గమనించాను. ప్రస్తుతం ఎంపీ ల్యాడ్స్‌ పథకం లేకపోవడం వల్ల నా వంతు సహాయంగా విరాళం జిల్లా కలెక్టర్‌కు అందజేస్తున్నా. ఆర్థిక స్థోమత ఉన్నవారు స్వచ్ఛందంగా విరాళాలు అందజేయాలి. ఇప్పటికే తాను వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలువురు ప్రవాస భారతీయులతో మాట్లాడాను. కొద్ది రోజుల్లో వైద్య పరికరాలు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది’ అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement