Thursday, April 25, 2024

మళ్లీ వైసీపీ గూటికి వంగవీటి రాధా?

టీడీపీ నేత వంగవీటి రాధా ఏపీ మంత్రి కొడాలి నానితో ఓ కార్యక్రమంలో సన్నిహితంగా మెలిగారు. టీడీపీకి బద్ధశత్రువు లాంటి కొడాలి నానితో వంగవీటి రాధా విజయవాడలో సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానికి చెందిన ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి వంగవీటి రాధా కూడా విచ్చేశారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధాను మంత్రి కొడాలి నాని ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఫంక్షన్ హాల్లోని ఓ గదిలో కాసేపు చర్చలు జరిపిన వీరిద్దరూ వేదిక వరకు కలిసే వచ్చారు. ఈ కలయిక పలు ఊహాగానాలకు దారితీసింది. వంగవీటి రాధా వైసీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారా? అనే కోణంలో ప్రచారానికి తెరలేచింది. కాగా వచ్చే ఎన్నికల్లో రాధా గుడివాడ బరిలో దిగుతారని, మంత్రి కొడాలి నానిపై పోటీ చేస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, నిన్న జరిగిన పరిణామంతో కొత్త చర్చ మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement