Wednesday, April 24, 2024

తుఫాను బాధితులకు టీడీపీ శ్రేణులు సాయం అందించాలి: చంద్రబాబు

గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని…తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టీడీపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలని చంద్రబాబు తెలిపారు. బాధితులకు టీడీపీ శ్రేణులు అన్ని విధాలా అండగా నిలవాలన్నారు. గులాబ్ తుఫాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగకుండా అప్రమత్తంగా ఉండాని, ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని చంద్రబాబు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement