Friday, March 29, 2024

హేమంత్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఉమ

మైలవరం, (ప్రభ న్యూస్) – ఉక్రెయిన్ లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి మాదు హేమంత్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీమంత్రి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు.వీడియో కాల్ ద్వారా విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడించిన మాజీమంత్రి, ధైర్యంగా ఉండాలని హేమంత్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.ఎంపీ కేశినేని నాని,ఇతర తెలుగుదేశం నాయకుల ద్వారా విద్యార్థులను తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు.త‌మ పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడు కూడా లేఖలు వ్రాస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement