Tuesday, April 16, 2024

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు..

కొత్తగూడెం: భద్రాద్రి సీతారామయ్యను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. అనంతరం భద్రాచలం కరకట్టను పరిశీలించారు. చంద్రబాబు మాట్లాడుతూ… 20ఏళ్ల క్రితం కట్టిన కరకట్టను ప్రజలు ఈనాటికీ గుర్తు పెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ సమస్యను స్వయంగా పరిశీలించానని చెప్పుకొచ్చారు. చేసిన అభివృద్ధి సామాజిక సేవా శాశ్వతంగా ఉండటం ఎంతో తృప్తి నిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న చిన్నపాటి లోటు పాట్లను ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విలీన గ్రామాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టి బాధిత ప్రజలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement