Friday, April 19, 2024

మనవడితో కలిసి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో కుటుంబసభ్యులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశమంతా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు చేసుకుంటూ స్వాతంత్ర్య ఉద్యమ క్షణాలను స్మరణకు తెచ్చుకోవడం గర్వంగా ఉందని చంద్రబాబు తెలిపారు.

అణిచివేత నుంచి బయటపడి ఆనాడు మన నేతలు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజల భావాలకు, ఎదుగుదలకు అడుగడుగునా సంకెళ్లు పడుతుంటే మహనీయుల త్యాగాలకు అర్థమేముందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ వేడుకల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్, ఆయన తనయుడు నారా దేవాన్ష్ పాల్గొని త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: దేశ జెండాను అవమానించారంటూ చెర్రీపై నెటిజన్ల ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement