Thursday, April 18, 2024

ఎల్లుండి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 8 నుంచి తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తిరుపతి లోక్‌సభ స్ధానానికి జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ బరిలో ఉన్నారు. ఆమెకు మద్దతుగా చంద్రబాబు వారం రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రికి చంద్రబాబు తిరుపతి చేరుకుంటారు. 8న ఉదయం శ్రీవారిని దర్శించుకుని పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రోజుకు ఒక శాసనసభ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో రెండు మూడు ప్రచార సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. కాగా తిరుపతిలో ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement