Saturday, April 20, 2024

ఎన్టీఆర్ యుగ పురుషుడు-మ‌నం వైసీపీ బానిస‌లం కాదు – చంద్ర‌బాబు

ఎన్టీఆర్ యుగ పురుషుడ‌ని తెలిపారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఒంగోలు అద్దంకి బ‌స్టాండ్ సెంట‌ర్ కి చేరుకున్నారు టిడిపి అధినేత చంద్ర‌బాబు. ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఎన్టీఆర్ విగ్ర‌హం నుంచి మ‌హానాడు వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు చంద్ర‌బాబు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. టీడీపీ హ‌యాంలోనే ఒంగోలు అభివృద్ధి జ‌రిగింద‌ని అన్నారు. ఎన్టీఆర్ పెద్ద సంస్క‌ర‌ణ వాది..ముందు చూపు ఉన్న‌నాయ‌కుడ‌ని చంద్ర‌బాబు తెలిపారు. మ‌న జ‌నాలు ఉన్నారు..వైసీపీకి బస్సులే ఉన్నాయ‌న్నారు. మ‌న స‌భ‌కి జ‌నం రాకుండా అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్నార‌న్న‌రు.మ‌నం ఏమ‌న్నా వైసీపీకి బానిస‌ల‌మా అని నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement