Friday, April 19, 2024

రాయ‌ల‌సీమ‌కు టీడీపీ, వైసీపీ ఏమీ చేయ‌లేదు.. జీవీఎల్

రాయ‌ల‌సీమ‌కు టీడీపీ, వైసీపీ ఏమీ చేయ‌లేద‌ని బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… పోల‌వ‌రం ప్రాజెక్టుపై వైసీపీ, టీడీపీ పోటీప‌డుతున్నాయ‌న్నారు. పోల‌వ‌రంపై ఉన్న శ్ర‌ద్ధ వెలుగొండ ప్రాజెక్టుపై ఎందుకు లేద‌న్నారు. రెండు పార్టీలు ప‌ర్సంటేజ్ ల‌కు అల‌వాటు ప‌డ్డాయ‌న్నారు. గ‌త ఇరిగేష‌న్ మంత్రిపై ఆరోప‌ణ‌లున్నా విచార‌ణ చేయ‌డం లేద‌న్నారు. ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఆధారాలు త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement