Wednesday, April 24, 2024

కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణహత్య

కర్నూలు జిల్లా నిడ్జూరులో టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణహత్యకు గురయ్యాడు. వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న కారణంగానే వైసీపీ కార్యకర్తలు ఈ హత్య చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానిక వైసీసీ నేత సత్యంరెడ్డి ఇంటి ఎదుట శ్రీనివాసులు మృతదేహంతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేపట్టిన టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement