Thursday, April 25, 2024

అసెంబ్లీ ఎన్నికలపై తార‌క‌ర‌త్న‌ ఆసక్తి.. లోకేశ్ తో భేటీ

న‌టుడు తార‌క‌ర‌త్న టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ని ఆయ‌న నివాసంలో క‌లిశారు. కాగా వీరి భేటీలో కుటుంబపరమైన అంశాలతో పాటు రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. తారకరత్న గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అప్పుడప్పుడు అగ్రనేతలకు మద్దతుగా తన గళం వినిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో, ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. నేడు లోకేశ్ తో సమావేశంలోనూ తారకరత్న పోటీ చేసే నియోజకవర్గం అంశం ప్రస్తావనకు వచ్చినట్టు స‌మాచారం. తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కూడా లోకేశ్ తో తారకరత్న చెప్పినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement