Thursday, April 25, 2024

తార‌క‌ర‌త్న మృతి చాలా బాధ‌క‌రం… మంత్రి త‌ల‌సాని

సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి చాలా బాధాకరమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఫిల్మ్ చాంబర్ లో తారకరత్న పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తన 20వ ఏట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తారకరత్న 21కి పైగా చిత్రాలలో నటించారని తెలిపారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండే తారకరత్న మరణవార్త తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. తాత నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడిచేవారని చెప్పారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement