Thursday, April 25, 2024

రాధిక- శరత్‌కుమార్‌ దంపతులకు ఏడాది జైలుశిక్ష

చెక్ బౌన్స్ కేసులో నటుడు శరత్ కుమార్, ఆయన భార్య రాధికలకు చెన్నైలోని సైదాపేట కోర్టు ఏడాది శిక్ష విధించింది. శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఓ సినిమా కోసం 2015లో రేడియంట్ అనే మీడియా సంస్థ నుంచి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. అయితే తీసుకున్న అప్పును సమయానికి తీర్చలేకపోయారు. ఇచ్చిన చెక్ కాస్త బౌన్స్ అయింది. ఈ విషయమై రేడియంట్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో 2019లో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తాజాగా తీర్పు ఇచ్చిన కోర్టు రాధిక, శరత్‌కుమార్ దంపతులకు ఏడాది జైలు శిక్ష విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement