Friday, March 29, 2024

రాజకీయాల్లో నూతన ఒరవడి.. తమిళనాడులో కరోనా కట్టడి కోసం కమిటీ ఏర్పాటు

తమిళనాడులో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో భాగంగా స్టాలిన్ రాజకీయ ఒరవడికి నాంది పలికారు. ఈ మేరకు 13 మందితో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఏకంగా 12 మంది ప్రతిపక్ష పార్టీల నేతలకు స్టాలిన్ స్థానం కల్పించారు. ఈ కమిటీకి స్టాలిన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ఈ కమిటీ సమీక్షలు జరుపుతూ, ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సలహాలను అందిస్తుంది.

ఈ కమిటీలో ఉన్న సభ్యులు: డాక్టర్ ఎజిలన్ (డీఎంకే), డాక్టర్ విజయభాస్కర్ (ఏఐఏడీఎంకే), జీకే మణి (పీఎంకే), ఎస్ఎస్ బాలాజీ (వీసీకే), టీ రామచంద్రన్ (సీపీఐ), నాగై మాలి (సీపీఎం), డాక్టర్ జవహరుల్లా (ఎంఎంకే), ఏఎం మణిరత్నం (కాంగ్రెస్), నగర్ నాగేంద్రన్ (బీజేపీ), సుశాన్ తిరుమలై కుమార్ (ఎండీఎంకే), ఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), టి.వేల్మురుగన్ (టీవీకే), పూవై జగన్ మూర్తి (పీబీ). కాగా స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ప్రజలు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement