Thursday, April 18, 2024

అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు… కాల్ ఎవరు చేశారంటే..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటికి రెండు రోజుల క్రితం బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చెన్నైలోని ఇంజంబాకమ్ లో ఉంటున్న అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అజిత్ నివాసానికి వెళ్లి తనిఖీ చేశారు. అయితే, బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసుల ఫేక్ ఫోన్ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో తెలుసుకుని ఆ ఆకతాయిని పట్టుకున్నారు. చెన్నైలోని మరక్కానం ప్రాంతంలో ఉండే దినేశ్ అనే యువకుడు ఈ ఫోన్ కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే దినేశ్ కు మతిస్థిమితం లేదని, గతంలోనూ ఇలాంటి ఫోన్ కాల్స్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా, గతంలోనూ అజిత్ ఇంట్లో బాంబు ఉన్నట్లు బెదింరిపు ఫోన్ కాల్ వచ్చింది.

ఇది కూడా చదవండి: కరోనా ఎఫెక్ట్: భార్యను ట్రాలీలో తీసుకెళ్లిన భర్త

Advertisement

తాజా వార్తలు

Advertisement