Thursday, April 25, 2024

వడివేలు తల్లి కన్నుమూత.. సీఎం స్టాలిన్ సంతాపం

తమిళ కమెడియన్ వడివేలు తల్లి సరోజిని కన్నుమూశారు.ఆమె మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతికి తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా సరోజినీ మృతికి నివాళులు అర్పిస్తున్నారు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వడివేలు తల్లి సరోజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రం వడివేలు స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement